Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:02 PM

పిల్లల భద్రతే లక్ష్యం – చైనా మాంజాకు దూరంగా ఉండండి:జిల్లా పోలీస్ శాఖ

పిల్లల భద్రతే లక్ష్యం – చైనా మాంజాకు దూరంగా ఉండండి:జిల్లా పోలీస్ శాఖ

పిల్లల భద్రతే లక్ష్యం – చైనా మాంజాకు దూరంగా ఉండండి:జిల్లా పోలీస్ శాఖ
03-01-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి:ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా (నైలాన్ దారాలు) వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. చైనా మాంజా వల్ల ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పక్షులు తీవ్రంగా గాయపడటంతో పాటు ప్రాణ నష్టం జరిగిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో చైనా మాంజా వినియోగం, విక్రయాలపై కఠినంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది.

జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక దాడులు నిర్వహించి నిషేధిత చైనా మాంజా నిల్వలను సీజ్ చేశారు. నిబంధనలను ఉల్లంఘించి చైనా మాంజాను వాడినా లేదా అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లలను చైనా మాంజా వినియోగానికి దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు.జిల్లాలో ఎక్కడైనా నిషేధిత చైనా మాంజా వినియోగం లేదా విక్రయాలపై సమాచారం ఉన్నట్లయితే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాలను నివారించి ప్రాణ భద్రతను కాపాడగలమని జిల్లా పోలీస్ శాఖ పేర్కొంది.

Sthanikam

పిల్లల భద్రతే లక్ష్యం – చైనా మాంజాకు దూరంగా ఉండండి:జిల్లా పోలీస్ శాఖ

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి:ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా (నైలాన్ దారాలు) వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. చైనా మాంజా వల్ల ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పక్షులు తీవ్రంగా గాయపడటంతో పాటు ప్రాణ నష్టం జరిగిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో చైనా మాంజా వినియోగం, విక్రయాలపై కఠినంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది.

జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక దాడులు నిర్వహించి నిషేధిత చైనా మాంజా నిల్వలను సీజ్ చేశారు. నిబంధనలను ఉల్లంఘించి చైనా మాంజాను వాడినా లేదా అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లలను చైనా మాంజా వినియోగానికి దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు.జిల్లాలో ఎక్కడైనా నిషేధిత చైనా మాంజా వినియోగం లేదా విక్రయాలపై సమాచారం ఉన్నట్లయితే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాలను నివారించి ప్రాణ భద్రతను కాపాడగలమని జిల్లా పోలీస్ శాఖ పేర్కొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News