Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:21 PM

పాలకురాలిగా కాదు సేవకురాలిగా పనిచేస్తా

పాలకురాలిగా కాదు సేవకురాలిగా పనిచేస్తా

పాలకురాలిగా కాదు సేవకురాలిగా పనిచేస్తా
February 03, 2026 12:23 PM 268 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వెన్ రెడ్డి సంధ్య రాజు

పాలకురాలిగా కాదు సేవకురాలిగా పనిచేస్తానని చౌటుప్పల్ మున్సిపాలిటీలోని16వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్ రెడ్డి సంధ్య రాజు,అన్నారు.మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ లో 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్ రెడ్డి సంధ్య రాజు, తమ వార్డులో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చేతి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను అభ్యర్థించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి మమున్సిపాలిటీలో 20 వార్డులలో కౌన్సిలర్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌ను గెలిపిస్తాయని వివరించారు.16వ వార్డు ప్రాంత ప్రజలకు సేవకురాలిగా నిలుస్తాను అన్నారు. వార్డు అభివృద్ధే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. నిత్యం ప్రజలతో మమేకమై వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని వార్డు ప్రజలు చేతి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.పదవి కోసం నేను నా భర్త వెన్ రెడ్డి రాజు రాజకీయం లోకి రాలేదని, చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రగతి కోసం సేవలందించడానికి వచ్చామని తెలిపారు.ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతోమున్సిపాలిటీలో 16వ వార్డును అభివృద్ధి పథంలో మొదటి స్థానంలో నిలుపుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానుగుల వెంకటయ్య, ఖలీల్, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News