పాలకురాలిగా కాదు సేవకురాలిగా పనిచేస్తా
పాలకురాలిగా కాదు సేవకురాలిగా పనిచేస్తా
K.RAVI
వెన్ రెడ్డి సంధ్య రాజు
పాలకురాలిగా కాదు సేవకురాలిగా పనిచేస్తానని చౌటుప్పల్ మున్సిపాలిటీలోని16వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్ రెడ్డి సంధ్య రాజు,అన్నారు.మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ లో 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్ రెడ్డి సంధ్య రాజు, తమ వార్డులో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చేతి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను అభ్యర్థించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి మమున్సిపాలిటీలో 20 వార్డులలో కౌన్సిలర్ స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయని వివరించారు.16వ వార్డు ప్రాంత ప్రజలకు సేవకురాలిగా నిలుస్తాను అన్నారు. వార్డు అభివృద్ధే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. నిత్యం ప్రజలతో మమేకమై వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని వార్డు ప్రజలు చేతి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.పదవి కోసం నేను నా భర్త వెన్ రెడ్డి రాజు రాజకీయం లోకి రాలేదని, చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రగతి కోసం సేవలందించడానికి వచ్చామని తెలిపారు.ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతోమున్సిపాలిటీలో 16వ వార్డును అభివృద్ధి పథంలో మొదటి స్థానంలో నిలుపుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానుగుల వెంకటయ్య, ఖలీల్, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు మహిళలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి