పగడ్బందీగా పదవ తరగతి పరీక్షలు
పగడ్బందీగా పదవ తరగతి పరీక్షలు
Anjali
శ్రీ సత్య సాయి జిల్లా లో పదవ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలు మరియు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద
శనివారం సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలు 02.03.2026 నుండి 13.02.2026 వరకు 6 కేంద్రాల్లో 9 నుండి 12 గంటల వరకు నిర్వహించబడునని సదరు పరీక్షలకు 1244 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.
జిల్లాలో పదవ తరగతి రెగ్యులర్ మరియు ఓపెన్ స్కూల్ పరీక్షలు 16.03.2026 నుండి 01.04.2026 వరకు ఉదయం 9:30 నుండి 12 గంటల 45 నిమిషాల వరకు 107 కేంద్రాల్లో ఈ పరీక్షలకు 22303 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని ఓపెన్ స్కూల్ 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుండి 12:30 వరకు 5 కేంద్రాల్లో 446 విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారని ఈ పరీక్షలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య తెలిపారు. ఓపెన్ టెన్త్ పరీక్షలకు జిల్లాలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈ పరీక్షలకు 446 మంది హాజరవుతారని తెలిపారు. విద్యార్థులంతా సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు విద్యుత్ సరఫరాల అంతరాయం ఉండకూడదు అని అన్నారు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు పరీక్షా పత్రాలకు తనిఖీ బృందాలకు ఎస్కార్ట్ పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు తపాలా సిబ్బందికి సహకరించాలన్నారు ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కడా కూడా మాస్కాపింగ్ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు సమస్య ఆత్మ కేంద్రాల్లో అదనపు భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జి కృష్ణప్ప డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ అధికారి చెన్నకేశవ ప్రసాద్ ప్రభుత్వ పరీక్షల జిల్లా కోఆర్డినేటర్ లాజరు తదితరులు హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి