Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:11 AM

పేషెంట్లకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్

పేషెంట్లకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్

పేషెంట్లకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్
January 06, 2026 03:27 PM 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి స్థానిక ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు డాక్టర్లు, సిబ్బంది పేషెంట్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మంగళవారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రి వార్డులు, విభాగాలను పరిశీలించిన కలెక్టర్ హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేసి, ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల సరఫరాపై వివరాలు తెలుసుకున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచాలనిసూచించారు.అనంతరం ఆశ డే సందర్భంగా నిర్వహించిన సమావేశంలో గర్భిణీల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, రెగ్యులర్ చెకప్‌లు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొదటి నెల నుంచే నార్మల్ డెలివరీకి గర్భిణీలను సిద్ధం చేసి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News