PRINT TIME: April 10, 2026 09:11 AM
పేషెంట్లకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్
పేషెంట్లకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్
January 06, 2026 03:27 PM
41 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి స్థానిక ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు డాక్టర్లు, సిబ్బంది పేషెంట్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మంగళవారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రి వార్డులు, విభాగాలను పరిశీలించిన కలెక్టర్ హాజరు రిజిస్టర్ను తనిఖీ చేసి, ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల సరఫరాపై వివరాలు తెలుసుకున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచాలనిసూచించారు.అనంతరం ఆశ డే సందర్భంగా నిర్వహించిన సమావేశంలో గర్భిణీల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, రెగ్యులర్ చెకప్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొదటి నెల నుంచే నార్మల్ డెలివరీకి గర్భిణీలను సిద్ధం చేసి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి