Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:16 AM

పేషెంట్లకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్

పేషెంట్లకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్

పేషెంట్లకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్
06-01-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి స్థానిక ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు డాక్టర్లు, సిబ్బంది పేషెంట్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మంగళవారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రి వార్డులు, విభాగాలను పరిశీలించిన కలెక్టర్ హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేసి, ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల సరఫరాపై వివరాలు తెలుసుకున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచాలనిసూచించారు.అనంతరం ఆశ డే సందర్భంగా నిర్వహించిన సమావేశంలో గర్భిణీల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, రెగ్యులర్ చెకప్‌లు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొదటి నెల నుంచే నార్మల్ డెలివరీకి గర్భిణీలను సిద్ధం చేసి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Sthanikam

పేషెంట్లకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్

Article Image
యాదాద్రి భువనగిరి స్థానిక ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు డాక్టర్లు, సిబ్బంది పేషెంట్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మంగళవారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రి వార్డులు, విభాగాలను పరిశీలించిన కలెక్టర్ హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేసి, ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల సరఫరాపై వివరాలు తెలుసుకున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచాలనిసూచించారు.అనంతరం ఆశ డే సందర్భంగా నిర్వహించిన సమావేశంలో గర్భిణీల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, రెగ్యులర్ చెకప్‌లు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొదటి నెల నుంచే నార్మల్ డెలివరీకి గర్భిణీలను సిద్ధం చేసి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News