నకిరేకల్ సానికం ప్రతినిధి
పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నిజంగా వరమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ప్రాంతంలో నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు రూ.9 లక్షల 67 వేల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఆపదలో ఆసుపత్రుల పాలైన నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా మారిందన్నారు. వైద్య చికిత్సల కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ పథకం పెద్ద భరోసాగా నిలుస్తోందని తెలిపారు. అర్హులైన నిరుపేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి