పదవి కాదు సేవే లక్ష్యం – నీర్నెముల నూతన సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి
పదవి కాదు సేవే లక్ష్యం – నీర్నెముల నూతన సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి
స్థానికం బృందం
గ్రామాభివృద్ధే నా తొలి లక్ష్యం
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేట మండల పరిధిలోని నీర్నెముల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కందిమల్ల గోపాల్ రెడ్డి సర్పంచ్గా ఘన విజయం సాధించారు. గెలుపు అనంతరం అక్షిత ప్రతినిధితో మాట్లాడుతూ, గ్రామానికి గత కొన్ని సంవత్సరాలుగా తాను నిర్వహించిన సామాజిక సేవలు, స్వచ్ఛంద కార్యక్రమాలే తన విజయానికి కారణమని పేర్కొన్నారు.
పదవి తనకు ముఖ్యం కాదని, గ్రామాభివృద్ధే తన తొలి లక్ష్యమని స్పష్టం చేసిన గోపాల్ రెడ్డి—అవసరమైతే తన సొంత నిధులతోనైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానన్నారు. గ్రామానికి అవసరమైన సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే గ్రామ ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో సమన్వయం చేసుకుని అవసరమైన నిధులు తీసుకొచ్చి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానని పునరుద్ఘాటించిన నూతన సర్పంచ్—తన గెలుపుకు సహకరించిన గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, యువకులు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆశీర్వదించి అవకాశం ఇచ్చినందుకు గ్రామానికి నిస్వార్థంగా సేవ చేస్తానని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి