Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 13, 2026 10:53 PM

పదవతరగతి పరీక్షలు జీవితానికి తొలి మెట్టు – డీఎస్పీ మధుసూదన్ రెడ్డి

పదవతరగతి పరీక్షలు జీవితానికి తొలి మెట్టు – డీఎస్పీ మధుసూదన్ రెడ్డి

పదవతరగతి పరీక్షలు జీవితానికి తొలి మెట్టు – డీఎస్పీ మధుసూదన్ రెడ్డి
March 13, 2026 08:11 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : CHOUTUPPAL MANDAL
K.RAVI

పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలని చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి సూచించారు.

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని మోడల్ స్కూల్, కస్తూరిబా గాంధీ విద్యాలయం, అంకిరెడ్డి గూడెం మైనార్టీ గురుకుల పాఠశాల, అంకిరెడ్డి గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు ఓరగంటి ఎట్టయ్య–అంజమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి కుమారుడు వరగంటి శ్రీనివాస్ గౌడ్ సమకూర్చిన 300 పరీక్ష ప్యాడ్లు, పెన్నులను డీఎస్పీ మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో ముఖ్యమైన తొలి మెట్టు అని అన్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంతో మంది ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఉన్నత స్థానాలకు చేరుకున్నారని పేర్కొన్నారు. విద్యకు పేదరికం అడ్డంకి కాదని, పట్టుదలతో చదివితే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్, ఎంఈఓ గురవరావు, కౌన్సిలర్లు బత్తుల వాణి విప్లవ్ గౌడ్, బద్రి గాలయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భవాని, బాలకృష్ణ, శివజ్యోతి, నాయకులు తోర్పునూరి రవి గౌడ్, బొమ్మిరెడ్డి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News