PRINT TIME: July 11, 2026 12:12 AM
పదవతరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ
పదవతరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ
March 13, 2026 03:15 PM
25 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
విద్యార్థులకు అండగా నిలిచిన పల్సం శివ గౌడ్
మాందాపురం గ్రామంలో పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు పల్సం శివ గౌడ్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి అందించడం ద్వారా వారికి ప్రోత్సాహం కలిగించాలని ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దంతూరి యాదమ్మ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో విద్యకు ప్రోత్సాహం ఇస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, యువకులు, ఇతరులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి