పదో వార్డు ప్రజలకు బంపర్ ఆఫర్… బీఆర్ఎస్ అభ్యర్థి నిమ్మనగోటి శ్రీనివాస్ సంచలన హామీలుపదో వార్డులో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతున్న వేళ బీఆర్ఎస్ అభ్యర్థి నిమ్మనగోటి శ్రీనివాస్ ప్రజలకు సంచలన హామీలతో ముందుకు వచ్చారు. పదో వార్డులోని ప్రతి కుటుంబాన్ని ఆదుకునేలా ప్రత్యేక పథకాలను ప్రకటిస్తూ ఓట్లను ఆకర్షిస్తున్నారు.
తాను గెలుపొందితే పదో వార్డులోని ప్రజలు ఏ శుభకార్యానికైనా ఫంక్షన్ హాల్ను పూర్తిగాఉచితంగాఅందుబాటులోకి తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో భారీ ఊరట కలగనుంది.
అలాగే ప్రతి ఆడబిడ్డ పెళ్లికి రూ.10,116 (పదివేల నూట పదహారు రూపాయలు) నగదు బహుమతిగా అందజేస్తానని ప్రకటించారు. అంతేకాదు, పదో వార్డులో ఆడపిల్ల జన్మించిన ప్రతి కుటుంబానికి రూ.5,016 ఆర్థిక సహాయం అందిస్తామని స్పష్టం చేశారు.ఈ హామీలతో పదో వార్డులో రాజకీయ చర్చ జోరుగా సాగుతోంది. ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరేలా చేసిన ఈ ప్రకటనలు స్థానికంగా విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి. 10 వ వార్డులో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని నిమ్మనగోటి శ్రీనివాస్ తెలిపారు. మరి ఈ హామీలు ఓటర్ల నిర్ణయంపై ఎంత మేర ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి