పబ్లిక్ టాయిలెట్ నిర్మాణంపై స్థానికుల అభ్యంతరం.....
పబ్లిక్ టాయిలెట్ నిర్మాణంపై స్థానికుల అభ్యంతరం.....
Harish HS
టాయిలెట్ వద్దు.. ఇబ్బందులు పడలేం...
25వ వార్డు ప్రజల ఆందోళన......
కోదాడ పట్టణంలోని 25వ వార్డు చేపల మార్కెట్ సమీపంలో పబ్లిక్ టాయిలెట్ నిర్మాణ ప్రతిపాదనపై వార్డు కౌన్సిలర్, స్థానికులు మండిపడుతున్నారు. గత పదేళ్లుగా వినియోగంలో లేని పాత టాయిలెట్ను కూల్చివేసిన అధికారులు, అదే స్థలంలో మళ్లీ కొత్తది నిర్మించాలని చూడటం సరికాదన్నారు. రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలు, మద్యం సేవించడం వంటివి సాగుతున్నాయన్నారు. ఇరుకైన గల్లీ కావడంతో వర్షం వస్తే నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.మున్సిపాలిటీ నుంచి బస్టాండ్ వరకు పలు టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయని అవే వాడకంలో లేవని వార్డులో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయమంటే నిధులు లేవని చెప్పే కమిషనర్ ప్రజలకు ఉపయోగపడని చోట నిధులు ఖర్చు చేయడం దుర్వినియోగమేనని విమర్శించారు. తమ అభ్యర్థనను కాదని ఇక్కడ టాయిలెట్ నిర్మించాలని చూస్తే ఊరుకోమన్నారు.ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ నిర్మించకుండా అడ్డుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ బాబా తాబుసం, జంపాల భద్రయ్య, భూలక్ష్మి, రామకృష్ణ, శ్రీనివాసరావు, మజీద్,ముత్యాలరావు, జాన్ బీ తదితరులు పాల్గొన్నారు......

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి