Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:46 AM

పబ్లిక్ టాయిలెట్ నిర్మాణంపై స్థానికుల అభ్యంతరం.....

పబ్లిక్ టాయిలెట్ నిర్మాణంపై స్థానికుల అభ్యంతరం.....

పబ్లిక్ టాయిలెట్ నిర్మాణంపై స్థానికుల అభ్యంతరం.....
March 13, 2026 08:05 AM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

టాయిలెట్ వద్దు.. ఇబ్బందులు పడలేం...

25వ వార్డు ప్రజల ఆందోళన......

కోదాడ పట్టణంలోని 25వ వార్డు చేపల మార్కెట్ సమీపంలో పబ్లిక్ టాయిలెట్ నిర్మాణ ప్రతిపాదనపై వార్డు కౌన్సిలర్, స్థానికులు మండిపడుతున్నారు. గత పదేళ్లుగా వినియోగంలో లేని పాత టాయిలెట్‌ను కూల్చివేసిన అధికారులు, అదే స్థలంలో మళ్లీ కొత్తది నిర్మించాలని చూడటం సరికాదన్నారు. రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలు, మద్యం సేవించడం వంటివి సాగుతున్నాయన్నారు. ఇరుకైన గల్లీ కావడంతో వర్షం వస్తే నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.మున్సిపాలిటీ నుంచి బస్టాండ్ వరకు పలు టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయని అవే వాడకంలో లేవని వార్డులో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయమంటే నిధులు లేవని చెప్పే కమిషనర్ ప్రజలకు ఉపయోగపడని చోట నిధులు ఖర్చు చేయడం దుర్వినియోగమేనని విమర్శించారు. తమ అభ్యర్థనను కాదని ఇక్కడ టాయిలెట్ నిర్మించాలని చూస్తే ఊరుకోమన్నారు.ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ నిర్మించకుండా అడ్డుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ బాబా తాబుసం, జంపాల భద్రయ్య, భూలక్ష్మి, రామకృష్ణ, శ్రీనివాసరావు, మజీద్,ముత్యాలరావు, జాన్ బీ తదితరులు పాల్గొన్నారు......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News