Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:23 PM

పబ్లిక్ టాయిలెట్ నిర్మాణంపై స్థానికుల అభ్యంతరం.....

పబ్లిక్ టాయిలెట్ నిర్మాణంపై స్థానికుల అభ్యంతరం.....

పబ్లిక్ టాయిలెట్ నిర్మాణంపై స్థానికుల అభ్యంతరం.....
March 13, 2026 08:05 AM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

టాయిలెట్ వద్దు.. ఇబ్బందులు పడలేం...

25వ వార్డు ప్రజల ఆందోళన......

కోదాడ పట్టణంలోని 25వ వార్డు చేపల మార్కెట్ సమీపంలో పబ్లిక్ టాయిలెట్ నిర్మాణ ప్రతిపాదనపై వార్డు కౌన్సిలర్, స్థానికులు మండిపడుతున్నారు. గత పదేళ్లుగా వినియోగంలో లేని పాత టాయిలెట్‌ను కూల్చివేసిన అధికారులు, అదే స్థలంలో మళ్లీ కొత్తది నిర్మించాలని చూడటం సరికాదన్నారు. రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలు, మద్యం సేవించడం వంటివి సాగుతున్నాయన్నారు. ఇరుకైన గల్లీ కావడంతో వర్షం వస్తే నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.మున్సిపాలిటీ నుంచి బస్టాండ్ వరకు పలు టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయని అవే వాడకంలో లేవని వార్డులో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయమంటే నిధులు లేవని చెప్పే కమిషనర్ ప్రజలకు ఉపయోగపడని చోట నిధులు ఖర్చు చేయడం దుర్వినియోగమేనని విమర్శించారు. తమ అభ్యర్థనను కాదని ఇక్కడ టాయిలెట్ నిర్మించాలని చూస్తే ఊరుకోమన్నారు.ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ నిర్మించకుండా అడ్డుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ బాబా తాబుసం, జంపాల భద్రయ్య, భూలక్ష్మి, రామకృష్ణ, శ్రీనివాసరావు, మజీద్,ముత్యాలరావు, జాన్ బీ తదితరులు పాల్గొన్నారు......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News