పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకే వైద్య శిబిరం: ఎమ్మెల్యే వేముల వీరేశం
పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకే వైద్య శిబిరం: ఎమ్మెల్యే వేముల వీరేశం
Editor Desk
పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకే వైద్య శిబిరం: ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్, స్థానిక ప్రతినిధి
పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం నకిరేకల్ మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన వైద్య శిబిరం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పట్టణ పారిశుధ్య నిర్వహణలో పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివని తెలిపారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత–శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ కమిషనర్, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి