Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:59 PM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతం చేయాలి – అదనపు కలెక్టర్ మాధురి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతం చేయాలి – అదనపు కలెక్టర్ మాధురి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతం చేయాలి – అదనపు కలెక్టర్ మాధురి
February 18, 2026 06:15 AM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతంగా, ఖచ్చితంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మాధురి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో ఓటరు జాబితా అత్యంత ముఖ్యమైనదని పేర్కొంటూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి దశను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు.మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో దూరదర్శి సమావేశం నిర్వహించి పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణలో మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి ఓటరిని సరైన పోలింగ్ కేంద్రానికి అనుసంధానం చేయడం ఖచ్చితంగా జరిగేలా చూడాలని సూచించారు.క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సరిచూసి, కొత్తగా అర్హత పొందిన వారి పేర్లు నమోదు చేయడం, మరణించిన లేదా వేరే ప్రాంతాలకు మారిన వారి పేర్లు తొలగించడం వంటి చర్యలను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని తెలిపారు.దూరదర్శి సమావేశంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ మాధురి మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిష్పక్షపాతంగా, తప్పిదాలకు తావులేకుండా పూర్తి చేస్తామని తెలిపారు. మండల స్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని, బూత్ స్థాయి అధికారులు అంకితభావంతో పనిచేస్తున్నారని వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని ప్రజలకు సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి అంబాదాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సమయానికి పూర్తి చేసి, పారదర్శకమైన మరియు ఖచ్చితమైన ఓటరు జాబితాను సిద్ధం చేయాలని అధికారులు సంకల్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News