చిట్యాల ఇన్చార్జ్ తహశీల్దార్ బి. విజయలక్ష్మి
ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించాలని చిట్యాల ఇంచార్జ్ తహశీల్దార్ విజయలక్ష్మి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఆమె ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో లోపాలను సరిదిద్దేందుకు ప్రతి రాజకీయ పార్టీ తమ తరపున ఒక ప్రతినిధిని నియమించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఓట్ల పరిశీలన పారదర్శకంగా జరగాలంటే పార్టీల సహకారం అవసరమని ఆమె పేర్కొన్నారు ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నట్లయితే, అటువంటి వాటిని గుర్తించి చట్టపరంగా తొలగిస్తామని తెలిపారు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించే ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను, నాయకులను కోరారు. ఓటర్ల సవరణ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడటంలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి