Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:41 AM

ఓటర్ల జాబితా సవరణకు సహకరించండి

ఓటర్ల జాబితా సవరణకు సహకరించండి

ఓటర్ల జాబితా సవరణకు సహకరించండి
20-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల ఇన్చార్జ్ తహశీల్దార్ బి. విజయలక్ష్మి

ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించాలని చిట్యాల ఇంచార్జ్ తహశీల్దార్ విజయలక్ష్మి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఆమె ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ​ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో లోపాలను సరిదిద్దేందుకు ప్రతి రాజకీయ పార్టీ తమ తరపున ఒక ప్రతినిధిని నియమించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఓట్ల పరిశీలన పారదర్శకంగా జరగాలంటే పార్టీల సహకారం అవసరమని ఆమె పేర్కొన్నారు ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నట్లయితే, అటువంటి వాటిని గుర్తించి చట్టపరంగా తొలగిస్తామని తెలిపారు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించే ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను, నాయకులను కోరారు. ఓటర్ల సవరణ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడటంలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ఓటర్ల జాబితా సవరణకు సహకరించండి

Article Image

చిట్యాల ఇన్చార్జ్ తహశీల్దార్ బి. విజయలక్ష్మి

ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించాలని చిట్యాల ఇంచార్జ్ తహశీల్దార్ విజయలక్ష్మి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఆమె ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ​ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో లోపాలను సరిదిద్దేందుకు ప్రతి రాజకీయ పార్టీ తమ తరపున ఒక ప్రతినిధిని నియమించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఓట్ల పరిశీలన పారదర్శకంగా జరగాలంటే పార్టీల సహకారం అవసరమని ఆమె పేర్కొన్నారు ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నట్లయితే, అటువంటి వాటిని గుర్తించి చట్టపరంగా తొలగిస్తామని తెలిపారు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించే ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను, నాయకులను కోరారు. ఓటర్ల సవరణ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడటంలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News