వట్టిమర్తి గ్రామంలో రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు యూత్ కాంగ్రెస్ నాయకులు బెల్లపు రమేష్. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి పోటీ చేసి కేవలం 2 ఓట్ల తేడాతో ఓటమి పాలైనప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు.
తన వార్డులో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను గుర్తించిన రమేష్, సమస్యకు కారణమైన పాత గేట్ వాలును తొలగించి, కొత్త గేట్ వాలును ఏర్పాటు చేయించారు. దీని ఫలితంగా 8వ వార్డులో నీటి కొరత పూర్తిగా తగ్గి, ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.
ఎన్నికల్లో ఓడిపోయినా సేవలో గెలిచిన రమేష్ చర్యలను స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్న ఆయన, ఇలాగే గ్రామ అభివృద్ధికి మరిన్ని సేవలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి