ఊరు వెళ్తున్నారా! సోషల్ మీడియాలో పెట్టకండి
ఊరు వెళ్తున్నారా! సోషల్ మీడియాలో పెట్టకండి
Biksham
ఊరు వెళ్తున్నారా..! సోషల్ మీడియాలో పెట్టకండి
సంక్రాంతి సందర్భంగా ప్రజలకు మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ సూచనలు
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలకు వెళ్లే ప్రజలు తమ పర్యటన వివరాలను సోషల్ మీడియాలో స్టేటస్లు, పోస్టుల రూపంలో ప్రచురించవద్దని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ మండల ప్రజలకు సూచించారు.ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో దొంగలు ఖాళీ ఇళ్లను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అందువల్ల ఇంట్లో నగలు, నగదు ఉంచకుండా వెంట తీసుకువెళ్లాలని లేదా బ్యాంకుల్లో భద్రపరుచుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే ఇంటిని విడిచి వెళ్లే ముందు పక్కింటి వారు, బంధువులు లేదా స్నేహితులకు సమాచారం ఇవ్వాలని, ఇంటి పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే చోరీలు, నేరాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమని పేర్కొన్న ఎస్సై, భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి