Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:57 AM

ఓటుహక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోండి

ఓటుహక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోండి

ఓటుహక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోండి
07-02-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్వేచ్ఛాయుత ఎన్నికలకు పూర్తి బందోబస్తు

డిసిపీ భాస్కర్ పిలుపు

నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా డిసిపీ భాస్కర్ కోరారు.శనివారం బెల్లంపల్లి పట్టణంలోని జంబజార్ ప్రాంతంలో ఉన్న బ్రాంచ్ స్కూల్‌ను ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లాలో ఒక మేయర్, ఒక కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.బెల్లంపల్లికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడి పరిస్థితులను బట్టి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును ప్రజలు భయాందోళనలేకుండా వినియోగించుకోవాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని డిసిపీ భాస్కర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, వన్ టౌన్ ఎస్ హెచ్ఓ శ్రీనివాస రావు, టూ టౌన్ ఎస్ ఐ కిరణ్, మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

ఓటుహక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోండి

Article Image

స్వేచ్ఛాయుత ఎన్నికలకు పూర్తి బందోబస్తు

డిసిపీ భాస్కర్ పిలుపు

నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా డిసిపీ భాస్కర్ కోరారు.శనివారం బెల్లంపల్లి పట్టణంలోని జంబజార్ ప్రాంతంలో ఉన్న బ్రాంచ్ స్కూల్‌ను ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లాలో ఒక మేయర్, ఒక కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.బెల్లంపల్లికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడి పరిస్థితులను బట్టి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును ప్రజలు భయాందోళనలేకుండా వినియోగించుకోవాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని డిసిపీ భాస్కర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, వన్ టౌన్ ఎస్ హెచ్ఓ శ్రీనివాస రావు, టూ టౌన్ ఎస్ ఐ కిరణ్, మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News