ఓటుహక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోండి
ఓటుహక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోండి
Biksham
స్వేచ్ఛాయుత ఎన్నికలకు పూర్తి బందోబస్తు
డిసిపీ భాస్కర్ పిలుపు
నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా డిసిపీ భాస్కర్ కోరారు.శనివారం బెల్లంపల్లి పట్టణంలోని జంబజార్ ప్రాంతంలో ఉన్న బ్రాంచ్ స్కూల్ను ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లాలో ఒక మేయర్, ఒక కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.బెల్లంపల్లికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడి పరిస్థితులను బట్టి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును ప్రజలు భయాందోళనలేకుండా వినియోగించుకోవాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని డిసిపీ భాస్కర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, వన్ టౌన్ ఎస్ హెచ్ఓ శ్రీనివాస రావు, టూ టౌన్ ఎస్ ఐ కిరణ్, మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి