Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:41 PM

ఓటుహక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోండి

ఓటుహక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోండి

ఓటుహక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోండి
February 07, 2026 04:43 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్వేచ్ఛాయుత ఎన్నికలకు పూర్తి బందోబస్తు

డిసిపీ భాస్కర్ పిలుపు

నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా డిసిపీ భాస్కర్ కోరారు.శనివారం బెల్లంపల్లి పట్టణంలోని జంబజార్ ప్రాంతంలో ఉన్న బ్రాంచ్ స్కూల్‌ను ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లాలో ఒక మేయర్, ఒక కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.బెల్లంపల్లికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడి పరిస్థితులను బట్టి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును ప్రజలు భయాందోళనలేకుండా వినియోగించుకోవాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని డిసిపీ భాస్కర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, వన్ టౌన్ ఎస్ హెచ్ఓ శ్రీనివాస రావు, టూ టౌన్ ఎస్ ఐ కిరణ్, మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News