Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:13 AM

ఓటుహక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోండి

ఓటుహక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోండి

ఓటుహక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోండి
February 07, 2026 04:43 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్వేచ్ఛాయుత ఎన్నికలకు పూర్తి బందోబస్తు

డిసిపీ భాస్కర్ పిలుపు

నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా డిసిపీ భాస్కర్ కోరారు.శనివారం బెల్లంపల్లి పట్టణంలోని జంబజార్ ప్రాంతంలో ఉన్న బ్రాంచ్ స్కూల్‌ను ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లాలో ఒక మేయర్, ఒక కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.బెల్లంపల్లికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడి పరిస్థితులను బట్టి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును ప్రజలు భయాందోళనలేకుండా వినియోగించుకోవాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని డిసిపీ భాస్కర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, వన్ టౌన్ ఎస్ హెచ్ఓ శ్రీనివాస రావు, టూ టౌన్ ఎస్ ఐ కిరణ్, మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News