ఓటింగ్కు గుర్తింపు తప్పనిసరి.. 18 కార్డులకు గ్రీన్ సిగ్నల్.కలెక్టర్ హనుమంతరావు
ఓటింగ్కు గుర్తింపు తప్పనిసరి.. 18 కార్డులకు గ్రీన్ సిగ్నల్.కలెక్టర్ హనుమంతరావు
Editor Desk
భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరు మున్సిపాలిటీల్లో ఈ నెల 11న జరగనున్న ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గుర్తింపు పత్రం తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు సూచించారు.ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా భయపడాల్సిన అవసరం లేదని, మొత్తం 18 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని చూపించి ఓటు వేయవచ్చని ఆయన తెలిపారు. ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫోటోతో కూడిన బ్యాంకు లేదా తపాలా పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, పెన్షన్ పత్రాలు, దివ్యాంగుల గుర్తింపు కార్డు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అధికారిక గుర్తింపు కార్డులు తదితరాలను పోలింగ్ కేంద్రాల్లో అంగీకరిస్తామని స్పష్టం చేశారు.ప్రతి ఓటరు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య బలోపేతానికి తమ ఓటు కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి