Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:03 AM

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి
December 22, 2025 06:16 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల మ్యాపింగ్‌పై దృష్టి… గడువులోగా పూర్తి చేయాలని ఆదేశాల

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నేపథ్యంలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రోజుకు కనీసం 10 వేల మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించి, నిర్దిష్ట గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే వారంలోగా మ్యాపింగ్ ప్రక్రియలో గణనీయమైన పురోగతి కనిపించాలని పేర్కొన్నారు.

మ్యాపింగ్‌తో పాటు ఓటర్ల జాబితాలో ఉన్న బ్లర్ ఫోటోలు, చిన్న ఫోటోలు, అస్పష్టమైన ఫోటోల గుర్తింపు చేపట్టాలని, ఫారం–8 ద్వారా అసలైన ఫోటోలు సేకరించి జాబితాను నవీకరించాలని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను 2026 జనవరి 13లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హనుమంత రావు, చౌటుప్పల్ రెవిన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News