ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి
ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి
Biksham
సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు వైసీపీ విజ్ఞప్తి
స్థానికం ప్రతినిధి
ఆదోని నియోజకవర్గంలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అమలవుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను కోరింది.
ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలు ఖచ్చితంగా, తాజాగా మరియు ఎలాంటి పొరపాట్లు లేకుండా రూపొందించడమే ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆదోని నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులైన బూత్ స్థాయి అధికారులు, సంబంధిత ఎన్నికల అధికారులు కలిసి పాల్గొనే విధంగా ముందస్తు సమాచారం ఇచ్చి సమన్వయ సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం ద్వారా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కలిగి, కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చని వారు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షులు దేవా కౌన్సిలర్ బాలాజీతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి