Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:23 PM

ఒకే చోట ఐదు తరాల సందడి..!!

ఒకే చోట ఐదు తరాల సందడి..!!

ఒకే చోట ఐదు తరాల సందడి..!!
February 22, 2026 07:30 PM 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

చిత్రపు అన్నపూర్ణమ్మ ‘శతాధిక’ సంబరాలు

ఐదు తరాల ఆశీర్వాదంతో అరుదైన వేడుక

కోదాడ, పట్టణానికి చెందిన వృద్ధురాలు చిత్రపు అన్నపూర్ణమ్మ (105) వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబ సభ్యులు ఘనంగా ‘శతాధికా సంబరాలు’ నిర్వహించారు.

ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న అన్నపూర్ణమ్మ తన జీవితకాలంలో ఐదు తరాలను చూసి ఆశీర్వదించడం కుటుంబానికి అపూర్వ భాగ్యంగా నిలిచింది. ఆదివారం పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఆమెకు చెందిన 108 మంది కుటుంబ సభ్యులు ఏకమై వేడుకలను వైభవంగా జరిపారు.

వందేళ్లు దాటిన ఈ వృద్ధురాలిని సాక్షాత్తు దైవస్వరూపంగా భావిస్తూ కుటుంబ సభ్యులంతా ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. కుటుంబ ఐక్యతకు ప్రతీకగా నిర్వహించిన ఈ వేడుకలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

ఈ కార్యక్రమంలో కుమారులు చిత్రపు నరసింహారావు, సుశీల, సుదర్శన్ రావు, కృష్ణకుమారి, మోహన్ రావు, అనసూర్య తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News