ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా
ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా
Editor Desk
అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తా
రామన్నపేట సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేష్
రామన్నపేట స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
ఎన్నో ఏండ్లుగా రాజకీయాలలో ఉండి పట్టణ ప్రజలకు సేవ చేస్తున్నానని, తనని సర్పంచ్ గా గెలిపిస్తే.. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవచేస్తానని, సీపీఐ(ఎం) బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ రామన్నపేట సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేష్ కోరారు. బుధవారం రామన్నపేట పట్టణంలోని పలు వార్డుల్లో సీసీఐ(ఎం) నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామన్నపేట పట్టణంలోని సమస్యలపై తనకు మంచి అవగాహన ఉందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పట్టణ ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ(ఎం) 6, 7వ వార్డుల అభ్యర్థులు మునికుంట్ల లెనిన్, బోళ్ల వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బందెల రాములు, మాజీ ఎంపిటిసిలు గొరిగే నరసింహ, వేమవరం సుదీర్ బాబు, నాయకులు పోతురాజు సాయికుమార్, ఎస్.కె చాంద్, భావండ్లపల్లి బాలరాజు, రాసాల రమేష్, ఆముద అంజయ్య, కుందూరు వెంకటేశ్వర్లు, రామిని లక్ష్మణ్, పల్లె సత్యం, నర్రా అండాలు ఉన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి