Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:13 AM

ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా
December 11, 2025 05:36 AM 106 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తా

రామన్నపేట సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేష్



రామన్నపేట స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ఎన్నో ఏండ్లుగా రాజకీయాలలో ఉండి పట్టణ ప్రజలకు సేవ చేస్తున్నానని, తనని సర్పంచ్ గా గెలిపిస్తే.. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవచేస్తానని, సీపీఐ(ఎం) బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ రామన్నపేట సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేష్ కోరారు. బుధవారం రామన్నపేట పట్టణంలోని పలు వార్డుల్లో సీసీఐ(ఎం) నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామన్నపేట పట్టణంలోని సమస్యలపై తనకు మంచి అవగాహన ఉందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పట్టణ ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ(ఎం) 6, 7వ వార్డుల అభ్యర్థులు మునికుంట్ల లెనిన్, బోళ్ల వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బందెల రాములు, మాజీ ఎంపిటిసిలు గొరిగే నరసింహ, వేమవరం సుదీర్ బాబు, నాయకులు పోతురాజు సాయికుమార్, ఎస్.కె చాంద్, భావండ్లపల్లి బాలరాజు, రాసాల రమేష్, ఆముద అంజయ్య, కుందూరు వెంకటేశ్వర్లు, రామిని లక్ష్మణ్, పల్లె సత్యం, నర్రా అండాలు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News