Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:13 AM

ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా
December 11, 2025 05:36 AM 1,123 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తా

రామన్నపేట సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేష్



రామన్నపేట స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ఎన్నో ఏండ్లుగా రాజకీయాలలో ఉండి పట్టణ ప్రజలకు సేవ చేస్తున్నానని, తనని సర్పంచ్ గా గెలిపిస్తే.. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవచేస్తానని, సీపీఐ(ఎం) బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ రామన్నపేట సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేష్ కోరారు. బుధవారం రామన్నపేట పట్టణంలోని పలు వార్డుల్లో సీసీఐ(ఎం) నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామన్నపేట పట్టణంలోని సమస్యలపై తనకు మంచి అవగాహన ఉందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పట్టణ ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ(ఎం) 6, 7వ వార్డుల అభ్యర్థులు మునికుంట్ల లెనిన్, బోళ్ల వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బందెల రాములు, మాజీ ఎంపిటిసిలు గొరిగే నరసింహ, వేమవరం సుదీర్ బాబు, నాయకులు పోతురాజు సాయికుమార్, ఎస్.కె చాంద్, భావండ్లపల్లి బాలరాజు, రాసాల రమేష్, ఆముద అంజయ్య, కుందూరు వెంకటేశ్వర్లు, రామిని లక్ష్మణ్, పల్లె సత్యం, నర్రా అండాలు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News