Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:34 PM

ఒక్క బండ ఇవ్వండి సారూ…!

ఒక్క బండ ఇవ్వండి సారూ…!

ఒక్క బండ ఇవ్వండి సారూ…!
March 13, 2026 11:21 AM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

యుద్ధం సెగతో సామాన్యుడి అవస్థలు

కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా చిన్న చితక హోటళ్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో అనేక హోటళ్లు కట్టెల పొయ్యులపై ఆధారపడి వ్యాపారం కొనసాగిస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే హోటళ్లు మూతపడగా, మరికొన్ని మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న చిన్న హోటల్ యజమానులు కట్టెల పొయ్యులతోనే హోటల్ నడుపుతూ ఉపాధిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడం వల్ల చిన్న వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఒక్క గ్యాస్ సిలిండర్ అయినా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హోటల్ నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

హోటళ్లు మూతపడితే తమకు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని హోటల్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్‌పై ఆధారపడి నడుస్తున్న హోటళ్లు, చిన్న వ్యాపార సముదాయాలు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో నిలిచిపోయాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News