Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 23, 2026 02:42 AM

ఓడి గెలిచా జనం సేవలోనే తరిస్తా.. పల్ల రవికుమార్

ఓడి గెలిచా జనం సేవలోనే తరిస్తా.. పల్ల రవికుమార్

ఓడి గెలిచా జనం సేవలోనే తరిస్తా.. పల్ల రవికుమార్
March 23, 2026 12:47 AM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

గాంధీనగర్ గుండెల్లో చెరగని ముద్ర ఓడినా వీడని జనం ప్రేమ..

ఉచిత మెగా వైద్య శిబిరానికి తరలి వచ్చిన 39వ డివిజన్ ప్రజలు..

నల్గొండ : ఎన్నికల ఫలితాలు కేవలం అంకెలే కానీ ప్రజల మనసుల్లో సంపాదించుకున్న స్థానం శాశ్వతం. పదవులు రావచ్చు, పోవచ్చు, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం నా ప్రాణం ఉన్నంత వరకు మరువలేను అని 39వ డివిజన్ లో సింహం గుర్తు పై పోటీ చేసి కొద్ది ఓట్లతో ఓటమి చెందిన పల్ల రవి కుమార్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది.


జనం ప్రేమ ముందు ఓటమి చిన్నబోయింది..


వైద్య శిబిరానికి తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం దక్కకపోయినా ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలు చూస్తుంటే తానూ ఎన్నడూ ఓడిపోలేదనే భావన కలుగుతోందని అన్నారు. ఓటమి అనేది కేవలం నా పేరు ముందు చేరిన ఒక పదం మాత్రమే. కానీ 'సేవ' అనేది నా రక్తంలోనే ఉంది. గాంధీనగర్ ప్రజలు నాపై చూపిస్తున్న ఈ గౌరవం, నమ్మకం వెలకట్టలేనివి ఈ ప్రేమను తలుచుకుంటే కళ్లు చెమర్చుతున్నాయి అని ఆయన పేర్కొన్నారు.​ కష్టకాలంలో తన వెన్నంటి ఉండి ప్రజాసేవలో తనను నడిపిస్తున్న తన కుటుంబ సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రోత్సాహం లేకపోతే ఈ స్థాయి సేవ చేయడం సాధ్యపడేది కాదని కొనియాడారు. గెలుపు అంటే కేవలం ఓట్లు రావడం మాత్రమే కాదు, ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడం అని ఈ రోజు తనకు అర్థమైందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులే తన మార్గదర్శకాలని నా జీవితాన్ని గాంధీనగర్ డివిజన్ ప్రజల సేవకే అంకితం చేస్తానని ఆయన పునరుద్ఘాటించారు. ఈ హెల్త్ క్యాంప్‌కు విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వైద్య శిబిరంలో వందలాది మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News