PRINT TIME: May 13, 2026 09:21 PM
నూతన ఎస్ఐ లవకుమార్ను శాలువాతో సత్కరించిన ఎన్హెచ్ఆర్ సంస్థ ప్రతినిధులు
నూతన ఎస్ఐ లవకుమార్ను శాలువాతో సత్కరించిన ఎన్హెచ్ఆర్ సంస్థ ప్రతినిధులు
May 13, 2026 08:18 PM
15 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి బదిలీపై వచ్చి నూతనంగా ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన లవకుమార్ను నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ ఆధ్వర్యంలో జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు నాగేష్, న్యాల్కల్ మండల అధ్యక్షులు నవీన్ కుమార్, అంజమ్మ, స్వరూపమ్మ మరియు కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా బైండ్ల కృష్ణ మాట్లాడుతూ జహీరాబాద్ పట్టణ పరిధిలో శాంతిభద్రతలు కాపాడుతూ ప్రజలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.అనంతరం స్పందించిన ఎస్ఐ లవకుమార్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి