Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:51 PM

నులిపురుగుల విషయం లో అజాగ్రత్త వహిస్తే ప్రాణాంతక మయ్యే అవకాశం ఉంది చనుబండ పిఏసియస్ చైర్పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావు

నులిపురుగుల విషయం లో అజాగ్రత్త వహిస్తే ప్రాణాంతక మయ్యే అవకాశం ఉంది చనుబండ పిఏసియస్ చైర్పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావు

నులిపురుగుల విషయం లో అజాగ్రత్త వహిస్తే ప్రాణాంతక మయ్యే అవకాశం ఉంది చనుబండ పిఏసియస్ చైర్పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావు
February 17, 2026 05:50 PM 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పిల్లల విషయంలో నులిపురుగులపట్ల జాగ్రత్తగా ఉండి వాటి నిర్మూలనకు మాత్రలు వేయక పోతే ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందని చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు అన్నారు.మంగళవారం మధ్యాహ్నం చాట్రాయి మండలం, చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీ లోని ఎం పీ పీ స్కూల్ లో, గౌడ బజారు ఎంపీపీ స్కూల్ లోనూ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ఏఎన్ఎం, ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోరంపూడి శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లలకు "ఆల్బెండజోల్"మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడుపు లోని నులి పురుగుల కారణంగా పిల్లలు వాంతులు, విరోచనాలు లాంటి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు అని మోరంపూడి పేర్కొన్నారు.నులిపురుగుల వల్ల కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, ఆకలి లేమి, చర్మంపై దద్దుర్లు, రక్త హీనత, బరువు తగ్గడం, ఆయాసం, కాళ్ల వాపులు వంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్ల సూచన అని మోరంపూడి తెలియ జేశారు.

ఆల్బెండజోల్ మాత్ర ఏడాదిలో రెండు సార్లు వేసుకుంటే నులిపురుగుల్ని పూర్తిగా నిర్మూలించవచ్చని మోరంపూడి సూచించారు.ఈ సందర్భంగా స్టూడెంట్స్ కు చేతులు శుభ్రపరచుకోనే విధానాన్ని ఆరోగ్య సిబ్బంది నేర్పారు.

ఈ కార్యక్రమంలో ఏఎన్ఏం బేబీ సరోజినీ, ఆశా వర్కర్ సునీత,ఉపాధ్యాయులు ముత్తయ్య, విజయ కుమార్,స్వర్ణ,విద్యార్థినీ, విద్యార్థులు, నక్కా రత్నారావు లు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News