బీసీల ఐక్యతకు బలమైన నినాదం… నూజివీడులో రాష్ట్రస్థాయి రజక మహాసభ ఘన విజయం!
కొలుసు పార్థసారధి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బీసీ (రజక) మహాసభకు చాట్రాయి మండలం చనుబండ గ్రామం నుంచి టిడిపి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివెళ్లారు.
నూజివీడు నియోజకవర్గం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము నేతృత్వంలో కార్యకర్తలు సమన్వయంతో కార్యక్రమానికి హాజరయ్యారు. మహాసభలో బీసీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమ పథకాల అమలు, రాజకీయ భాగస్వామ్యం పెంపుపై చర్చలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు చీదిరాల మారేశ్వరరావు, బూత్ కన్వీనర్ దార్ల సురేష్ కుమార్తో పాటు పలువురు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు. సభ విజయవంతం కావడంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి