Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:34 AM

నూజివీడు లో రూ.25 లక్షల రూపాయలతో రజక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన

నూజివీడు లో రూ.25 లక్షల రూపాయలతో రజక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన

నూజివీడు లో రూ.25 లక్షల రూపాయలతో రజక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన
22-02-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మంత్రి హామీ: రజకుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం

నూజివీడు పట్టణంలోని వెలమపేట రెండవ వార్డులో సుమారు రూ.25 లక్షల వ్యయంతో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ వర్గాల సంక్షేమానికి సుమారు రూ.52 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

బీసీ వర్గాల సంప్రదాయ కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తూ, చేతివృత్తుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సబ్సిడీతో కూడిన రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

నూజివీడు నియోజకవర్గ పరిధిలోని అన్ని సామాజిక వర్గాలకు కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. బీసీ కమ్యూనిటీ హాళ్లకు రూ.50 లక్షలు, ఇతర కమ్యూనిటీ హాళ్లకు రూ.30 నుంచి రూ.50 లక్షల వరకు కేటాయించి త్వరలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కాపు కమ్యూనిటీ హాల్ కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.

రజకుల ప్రధాన సమస్యలలో ఒకటైన ధోబీఘాట్ విద్యుత్ బిల్లులపై రాయితీ కల్పనకు కృషి చేస్తామని, జీవో నెంబర్ 111 అమలు దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ, జెడ్పీటీసీ స్థానాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు డి. రామారావు, తిరుమల తిరుపతి డైరెక్టర్ డి. శ్రీనివాసరావు, రజక సంఘ నాయకులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

నూజివీడు లో రూ.25 లక్షల రూపాయలతో రజక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన

Article Image

మంత్రి హామీ: రజకుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం

నూజివీడు పట్టణంలోని వెలమపేట రెండవ వార్డులో సుమారు రూ.25 లక్షల వ్యయంతో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ వర్గాల సంక్షేమానికి సుమారు రూ.52 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

బీసీ వర్గాల సంప్రదాయ కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తూ, చేతివృత్తుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సబ్సిడీతో కూడిన రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

నూజివీడు నియోజకవర్గ పరిధిలోని అన్ని సామాజిక వర్గాలకు కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. బీసీ కమ్యూనిటీ హాళ్లకు రూ.50 లక్షలు, ఇతర కమ్యూనిటీ హాళ్లకు రూ.30 నుంచి రూ.50 లక్షల వరకు కేటాయించి త్వరలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కాపు కమ్యూనిటీ హాల్ కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.

రజకుల ప్రధాన సమస్యలలో ఒకటైన ధోబీఘాట్ విద్యుత్ బిల్లులపై రాయితీ కల్పనకు కృషి చేస్తామని, జీవో నెంబర్ 111 అమలు దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ, జెడ్పీటీసీ స్థానాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు డి. రామారావు, తిరుమల తిరుపతి డైరెక్టర్ డి. శ్రీనివాసరావు, రజక సంఘ నాయకులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News