Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:55 AM

నూజివీడు లో రూ.25 లక్షల రూపాయలతో రజక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన

నూజివీడు లో రూ.25 లక్షల రూపాయలతో రజక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన

నూజివీడు లో రూ.25 లక్షల రూపాయలతో రజక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన
February 22, 2026 07:48 PM 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మంత్రి హామీ: రజకుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం

నూజివీడు పట్టణంలోని వెలమపేట రెండవ వార్డులో సుమారు రూ.25 లక్షల వ్యయంతో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ వర్గాల సంక్షేమానికి సుమారు రూ.52 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

బీసీ వర్గాల సంప్రదాయ కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తూ, చేతివృత్తుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సబ్సిడీతో కూడిన రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

నూజివీడు నియోజకవర్గ పరిధిలోని అన్ని సామాజిక వర్గాలకు కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. బీసీ కమ్యూనిటీ హాళ్లకు రూ.50 లక్షలు, ఇతర కమ్యూనిటీ హాళ్లకు రూ.30 నుంచి రూ.50 లక్షల వరకు కేటాయించి త్వరలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కాపు కమ్యూనిటీ హాల్ కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.

రజకుల ప్రధాన సమస్యలలో ఒకటైన ధోబీఘాట్ విద్యుత్ బిల్లులపై రాయితీ కల్పనకు కృషి చేస్తామని, జీవో నెంబర్ 111 అమలు దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ, జెడ్పీటీసీ స్థానాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు డి. రామారావు, తిరుమల తిరుపతి డైరెక్టర్ డి. శ్రీనివాసరావు, రజక సంఘ నాయకులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News