Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:52 PM

నూజివీడు లో రూ.25 లక్షల రూపాయలతో రజక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన

నూజివీడు లో రూ.25 లక్షల రూపాయలతో రజక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన

నూజివీడు లో రూ.25 లక్షల రూపాయలతో రజక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన
February 22, 2026 07:48 PM 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మంత్రి హామీ: రజకుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం

నూజివీడు పట్టణంలోని వెలమపేట రెండవ వార్డులో సుమారు రూ.25 లక్షల వ్యయంతో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ వర్గాల సంక్షేమానికి సుమారు రూ.52 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

బీసీ వర్గాల సంప్రదాయ కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తూ, చేతివృత్తుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సబ్సిడీతో కూడిన రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

నూజివీడు నియోజకవర్గ పరిధిలోని అన్ని సామాజిక వర్గాలకు కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. బీసీ కమ్యూనిటీ హాళ్లకు రూ.50 లక్షలు, ఇతర కమ్యూనిటీ హాళ్లకు రూ.30 నుంచి రూ.50 లక్షల వరకు కేటాయించి త్వరలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కాపు కమ్యూనిటీ హాల్ కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.

రజకుల ప్రధాన సమస్యలలో ఒకటైన ధోబీఘాట్ విద్యుత్ బిల్లులపై రాయితీ కల్పనకు కృషి చేస్తామని, జీవో నెంబర్ 111 అమలు దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ, జెడ్పీటీసీ స్థానాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు డి. రామారావు, తిరుమల తిరుపతి డైరెక్టర్ డి. శ్రీనివాసరావు, రజక సంఘ నాయకులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News