PRINT TIME: April 11, 2026 03:43 AM
నూతన డిటిడిసీ కొరియర్ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
నూతన డిటిడిసీ కొరియర్ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
January 11, 2026 05:41 PM
22 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్
యాదగిరిగుట్ట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిటిడిసీ కొరియర్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆధునిక కొరియర్, లాజిస్టిక్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల వ్యాపారులు, యువత, సాధారణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా స్థానిక వ్యాపారాలు విస్తరించేందుకు,ఆన్లైన్ వాణిజ్యానికి ఈ సేవలు దోహదపడతాయని తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి దిశగా మరిన్ని సేవా సంస్థలు ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిటిడిసీ ప్రతినిధులు,స్థానిక ప్రజాప్రతినిధులు,వ్యాపారులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి