Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:08 AM

నూతన బోర్ లైన్ ప్రారంభ కార్యక్రమంలో పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

నూతన బోర్ లైన్ ప్రారంభ కార్యక్రమంలో పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

నూతన బోర్ లైన్ ప్రారంభ కార్యక్రమంలో పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి
January 11, 2026 05:31 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:గ్రామీణాభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు వేస్తూ నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం కడపల్ తండాలో నూతన బోర్ నీటి లైన్ ప్రారంభ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని పూజా కార్యక్రమాల్లో భాగమయ్యారు.కడపల్ తండా ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో సర్పంచ్ విఠల్ నాయక్ చొరవ తీసుకొని నూతన బోర్ ఏర్పాటు చేశారు. బోర్ నుంచి తండా అంతటా నీరు సరఫరా అయ్యేలా పైప్ లైన్ పనులను పూర్తిచేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సర్పంచ్ విఠల్ నాయక్ చేతుల మీదుగా పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి నూతన నీటి లైన్‌ను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తండాలు, గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. త్రాగునీరు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైన మౌలిక సదుపాయమని, ఈ నీటి లైన్ ప్రారంభంతో కడపల్ తండా ప్రజలకు ఎంతో ఉపశమనం లభిస్తుందని అన్నారు. భవిష్యత్తులో కూడా తండా అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.సర్పంచ్ విఠల్ నాయక్ మాట్లాడుతూ తండా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ బోర్ నీటి లైన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు నిరంతర త్రాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాదవ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పరమేష్, లక్ష్మణ్ నాయక్, బాబు నాయక్, ఉపసర్పంచ్ నందు, సంగ రెడ్డి, సాయిలు, బీ రాజు తదితరులు పాల్గొన్నారు. తండా ప్రజలు నూతన బోర్ నీటి లైన్ ప్రారంభంపై సంతోషం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News