నూతన బోర్ లైన్ ప్రారంభ కార్యక్రమంలో పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి
నూతన బోర్ లైన్ ప్రారంభ కార్యక్రమంలో పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి
Sthanikam District Staff Reporter krishna
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:గ్రామీణాభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు వేస్తూ నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం కడపల్ తండాలో నూతన బోర్ నీటి లైన్ ప్రారంభ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని పూజా కార్యక్రమాల్లో భాగమయ్యారు.కడపల్ తండా ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో సర్పంచ్ విఠల్ నాయక్ చొరవ తీసుకొని నూతన బోర్ ఏర్పాటు చేశారు. బోర్ నుంచి తండా అంతటా నీరు సరఫరా అయ్యేలా పైప్ లైన్ పనులను పూర్తిచేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సర్పంచ్ విఠల్ నాయక్ చేతుల మీదుగా పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి నూతన నీటి లైన్ను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తండాలు, గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. త్రాగునీరు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైన మౌలిక సదుపాయమని, ఈ నీటి లైన్ ప్రారంభంతో కడపల్ తండా ప్రజలకు ఎంతో ఉపశమనం లభిస్తుందని అన్నారు. భవిష్యత్తులో కూడా తండా అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.సర్పంచ్ విఠల్ నాయక్ మాట్లాడుతూ తండా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ బోర్ నీటి లైన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు నిరంతర త్రాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాదవ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పరమేష్, లక్ష్మణ్ నాయక్, బాబు నాయక్, ఉపసర్పంచ్ నందు, సంగ రెడ్డి, సాయిలు, బీ రాజు తదితరులు పాల్గొన్నారు. తండా ప్రజలు నూతన బోర్ నీటి లైన్ ప్రారంభంపై సంతోషం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి