నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసిన :ఉప సర్పంచ్ వరికుప్పల ఎల్లయ్య
విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలని సీతానగరం గ్రామ ఉపసర్పంచ్ వరికుప్పల ఎల్లయ్య సూచించారు. మంగళవారం సీతానగరం గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 1తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు , పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్, పాఠశాల క్లాస్ టీచర్ వెంకటేశ్వర్లు గ్రామ పంచాయతి కార్యదర్శి నవిత మూడో వార్డు మెంబర్ పుల్లూరు ఉపేందర్ , సీనియర్ జర్నలిస్ట్ పడిశాల నాగరాజు , పడిశాల ఉదయ్ విద్యార్థిని ,విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి