నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్య కు సబ్ ఇన్స్పెక్టర్ యం. ప్రసాద్ లకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ద్వారా ప్రశంసా పత్రం
నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్య కు సబ్ ఇన్స్పెక్టర్ యం. ప్రసాద్ లకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ద్వారా ప్రశంసా పత్రం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జనవరి 26(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన “సారా మాన్పించి – ప్రజల్లో మార్పు” కార్యక్రమం ద్వారా విశేష సేవలు అందించినందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్యకి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ప్రశంసా పత్రం అందజేశారు.ఈ సందర్భంగా అక్రమ సారా తయారీని మాన్పించి బాధిత కుటుంబాలకు జీవనోపాధి కల్పించే దిశగా చేపట్టిన చర్యలు అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తూ అక్రమ మద్యం నిర్మూలనలో కీలక పాత్ర పోషించినందుక ఏ. మస్తానయ్య సేవలను వారు ప్రత్యేకంగా ప్రశంసించారు.అదేవిధంగా, అక్రమ మద్యం నిరోధక చర్యల్లో చురుకుగా పాల్గొని విధులను సమర్థవంతంగా నిర్వహించినందుకు సబ్ ఇన్స్పెక్టర్ ఎం. ప్రసాద్ కూడా ఎక్సైజ్ కమిషనర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం స్వీకరించారు.ఈ కార్యక్రమం ద్వారా అక్రమ సారాకు అడ్డుకట్ట వేయడమే కాకుండా, బాధిత కుటుంబాలను ప్రధాన జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన “సారా మాన్పించి – ప్రజల్లో మార్పు” కార్యక్రమం లక్ష్యాలకు ఇది నిదర్శనమని అధికారులు తెలిపారు. అక్రమ మద్యం నిర్మూలనతో పాటు సామాజిక పరివర్తన సాధనలో ఈ తరహా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని వారు స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి