Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:43 AM

నూజివీడు నియోజకవర్గంలో రూ.40 కోట్లతో,45 కిలోమీటర్ల బీటీ రోడ్లకు శ్రీకారం

నూజివీడు నియోజకవర్గంలో రూ.40 కోట్లతో,45 కిలోమీటర్ల బీటీ రోడ్లకు శ్రీకారం

నూజివీడు నియోజకవర్గంలో రూ.40 కోట్లతో,45 కిలోమీటర్ల బీటీ రోడ్లకు శ్రీకారం
February 10, 2026 06:30 AM 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నూజివీడు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలను అనుసంధానం చేస్తూ, మునుపెన్నడూ లేని విధంగా బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి అభివృద్ధిలో మరో మైలురాయిని సాధించిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి మరోసారి ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.

రూ.40 కోట్ల వ్యయంతో రోడ్ల అభివృద్ధి సుమారు రూ.40 కోట్ల వ్యయంతో 45 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి మంత్రివర్యులు కంకణం కట్టారు. ఇప్పటికే రోడ్ల పనులు ప్రారంభమై శరవేగంగా కొనసాగుతున్నాయి.ప్రధాన రహదారి మార్గాలు

అడవి నెక్కలం ➝ ఆగిరిపల్లి

ఆగిరిపల్లి ➝ రావిచర్ల అడ్డరోడ్డు

ఆగిరిపల్లి ➝ చొప్పరమెట్ల ➝ ఈదులగూడెం

వట్టిగుడిపాడు ➝ రామన్నగూడెం మీదుగా ➝ నూజివీడు రాజీవ్ సర్కిల్

ఈ రహదారులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి చర్యలు చేపడుతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు నూజివీడు పట్టణ ప్రగతితో పాటు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మంత్రివర్యుల కృషికి ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

ఏడాదిన్నర కాలంలోనే అభివృద్ధి పనులు ఊపందుకొని, నియోజకవర్గానికి కొత్త కాంతులు నింపుతున్నాయని ప్రజలు కొనియాడుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News