నూజివీడు నియోజకవర్గంలో రూ.40 కోట్లతో,45 కిలోమీటర్ల బీటీ రోడ్లకు శ్రీకారం
నూజివీడు నియోజకవర్గంలో రూ.40 కోట్లతో,45 కిలోమీటర్ల బీటీ రోడ్లకు శ్రీకారం
GADDAM JAGANMOHAN REDDY
నూజివీడు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలను అనుసంధానం చేస్తూ, మునుపెన్నడూ లేని విధంగా బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి అభివృద్ధిలో మరో మైలురాయిని సాధించిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి మరోసారి ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.
రూ.40 కోట్ల వ్యయంతో రోడ్ల అభివృద్ధి సుమారు రూ.40 కోట్ల వ్యయంతో 45 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి మంత్రివర్యులు కంకణం కట్టారు. ఇప్పటికే రోడ్ల పనులు ప్రారంభమై శరవేగంగా కొనసాగుతున్నాయి.ప్రధాన రహదారి మార్గాలు
అడవి నెక్కలం ➝ ఆగిరిపల్లి
ఆగిరిపల్లి ➝ రావిచర్ల అడ్డరోడ్డు
ఆగిరిపల్లి ➝ చొప్పరమెట్ల ➝ ఈదులగూడెం
వట్టిగుడిపాడు ➝ రామన్నగూడెం మీదుగా ➝ నూజివీడు రాజీవ్ సర్కిల్
ఈ రహదారులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి చర్యలు చేపడుతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు నూజివీడు పట్టణ ప్రగతితో పాటు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మంత్రివర్యుల కృషికి ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
ఏడాదిన్నర కాలంలోనే అభివృద్ధి పనులు ఊపందుకొని, నియోజకవర్గానికి కొత్త కాంతులు నింపుతున్నాయని ప్రజలు కొనియాడుతున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి