Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:57 AM

నూజివీడు నియోజకవర్గంలో రూ.40 కోట్లతో,45 కిలోమీటర్ల బీటీ రోడ్లకు శ్రీకారం

నూజివీడు నియోజకవర్గంలో రూ.40 కోట్లతో,45 కిలోమీటర్ల బీటీ రోడ్లకు శ్రీకారం

నూజివీడు నియోజకవర్గంలో రూ.40 కోట్లతో,45 కిలోమీటర్ల బీటీ రోడ్లకు శ్రీకారం
February 10, 2026 06:30 AM 125 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నూజివీడు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలను అనుసంధానం చేస్తూ, మునుపెన్నడూ లేని విధంగా బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి అభివృద్ధిలో మరో మైలురాయిని సాధించిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి మరోసారి ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.

రూ.40 కోట్ల వ్యయంతో రోడ్ల అభివృద్ధి సుమారు రూ.40 కోట్ల వ్యయంతో 45 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి మంత్రివర్యులు కంకణం కట్టారు. ఇప్పటికే రోడ్ల పనులు ప్రారంభమై శరవేగంగా కొనసాగుతున్నాయి.ప్రధాన రహదారి మార్గాలు

అడవి నెక్కలం ➝ ఆగిరిపల్లి

ఆగిరిపల్లి ➝ రావిచర్ల అడ్డరోడ్డు

ఆగిరిపల్లి ➝ చొప్పరమెట్ల ➝ ఈదులగూడెం

వట్టిగుడిపాడు ➝ రామన్నగూడెం మీదుగా ➝ నూజివీడు రాజీవ్ సర్కిల్

ఈ రహదారులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి చర్యలు చేపడుతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు నూజివీడు పట్టణ ప్రగతితో పాటు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మంత్రివర్యుల కృషికి ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

ఏడాదిన్నర కాలంలోనే అభివృద్ధి పనులు ఊపందుకొని, నియోజకవర్గానికి కొత్త కాంతులు నింపుతున్నాయని ప్రజలు కొనియాడుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News