నియమాలు పాటించండి… ఇంటికి సురక్షితంగా చేరుకోండి:కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి
నియమాలు పాటించండి… ఇంటికి సురక్షితంగా చేరుకోండి:కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి
Krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా తలరక్షణ కవచం ధరించాలి.నాలుగు చక్రాల వాహనం నడిపేటప్పుడు భద్రతా సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలి.
వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం ప్రాణాలకు తీవ్ర ప్రమాదం కలిగిస్తుంది,కావున ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.మద్యం సేవించి వాహనం నడపడం నేరమే కాకుండా, మీతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుంది అని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి సూచించారు.ప్రత్యేకంగా వాహనం నడిపే వారు వాహన చోదక అనుమతి పత్రం, వాహన నమోదు పత్రం, బీమా పత్రం తప్పనిసరిగా తమ వద్ద కలిగి ఉండాలి.ఈ పత్రాలు లేకపోతే ప్రమాద సమయంలో మీకు ఎలాంటి రక్షణ ఉండదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.కావున ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించి,ప్రమాదరహిత ప్రయాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో కంగ్టి ఎస్ఐ దుర్గా రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి