నిరుపేదలకు వరం..సీఎం సహాయనిధి
నిరుపేదలకు వరం..సీఎం సహాయనిధి
K.RAVI
సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్
సీఎం సహాయనిధి నిరుపేదల పాలిట వరంలాంటిదని సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన పెండ్యాల యాదమ్మకు మంజూరైన విలువైన రూ.1.75లక్షల విలువైన ఎల్ వోసిచెక్కును శనివారం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అనారోగ్యాల పాలై ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందలేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు ముందస్తుగా ఎల్ఓసి ఇచ్చి ఆదుకుంటుందన్నారు. ఎల్ వో సి మంజూరుకు సహకరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుర్కంటి అనూప్ రెడ్డి, వార్డు సభ్యులు ఊదరి రమేష్, దోనూరి కిరణ్, బొమ్మ అమరావతి, గ్రామస్తులు బొమ్మ సాలయ్య, బొమ్మరాములు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి