నిరుపేదలకు అండగా నిలిచిన యారగని నాగాశేషు గౌడ్
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో సామాజిక సేవా దృక్పథంతో శ్రీ యారగని నాగాశేషు గౌడ్ గారు మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం నాడు గ్రామానికి చెందిన ఎండి ముస్తఫా గారి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఆయన, వారికి చేదోడువాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో 25 కేజీల బియ్యాన్ని విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న వారికి తమవంతు సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యారగని నాగాశేషు గౌడ్ గారిని అభినందించారు. "సహాయం చేసే గుణం అందరికీ ఉండదని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తినిస్తాయని" వారు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి