నిరుపేద కుటుంబానికి రూ.10,116 ఆర్థిక సాయం అందించిన ఓర్సు రాజకుమార్
నిరుపేద కుటుంబానికి రూ.10,116 ఆర్థిక సాయం అందించిన ఓర్సు రాజకుమార్
Komidala Mahender reddy
చిట్యాల మండలం పెద్దకాపర్తి తిరుమలనాథ స్వామి దేవస్థానం చైర్మన్ ఓర్సు రాజకుమార్ మాటకు కట్టుబడి, పేద ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడమే నిజమైన నాయకత్వ లక్షణమని మరోసారి నిరూపించుకున్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి ఆయన ఆర్థిక సహాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు.గ్రామానికి చెందిన ఓర్సు రాజు కుమార్తె వివాహానికి గతంలో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు, రాజకుమార్ తన వంతు సహాయంగా రూ.10,116 నగదును అందజేశారు. శుక్రవారం పెద్దకాపర్తి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ మొత్తాన్ని కుటుంబానికి అందించారు.ఈ సందర్భంగా చిట్యాల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దకాపర్తి ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, ఏర్పుల నరసింహ, శిరస్సు రవి, ఓర్సు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి