నిరుపేద కుటుంబాలకు అండగా ఖేడ్ ముస్లిం కమిటీ
నిరుపేద కుటుంబాలకు అండగా ఖేడ్ ముస్లిం కమిటీ
Sthanikam District Staff Reporter krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ ముస్లిం కమిటీ తరపున నిరుపేద కుటుంబాలకు మానవతా సహాయం అందించారు.ఇటీవల నారాయణఖేడ్ పట్టణంలో వాషింగ్ సెంటర్లో పనిచేస్తూ ఓ యువకుడు హఠాత్తుగా మృతి చెందగా,ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు కమిటీ ముందుకు వచ్చింది.ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి ఖేడ్ ముస్లిం కమిటీ తరఫున రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు.అలాగే నిరుపేద కుటుంబానికి చెందిన ఓ ఆడపడుచు వివాహానికి రూ.20,000, మరో నిరుపేద కుటుంబానికి చెందిన ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ.5,000 సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణఖేడ్ మాజీ చైర్పర్సన్ అనంత్ స్వరూప్ శెట్కార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ,అవసరంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఎల్లప్పుడూ ఖేడ్ ముస్లిం కమిటీ అండగా ఉంటుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖేడ్ ముస్లిం కమిటీ అధ్యక్షులు వసీం కతీబ్, వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఫిరోజ్, అక్బర్ ఖాన్, ముక్రం ఖాన్, జాయింట్ సెక్రటరీ ఇసాక్,ఇమ్రాన్ ఖాధిబ్,ఎండి ఇస్మాయిల్, ఫైయాజ్ హాసమ్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి