Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీని పరామర్శి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 08:52 PM

నిరుపేద కుటుంబాలకు అండగా ఖేడ్ ముస్లిం కమిటీ

నిరుపేద కుటుంబాలకు అండగా ఖేడ్ ముస్లిం కమిటీ

నిరుపేద కుటుంబాలకు అండగా ఖేడ్ ముస్లిం కమిటీ
18-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ ముస్లిం కమిటీ తరపున నిరుపేద కుటుంబాలకు మానవతా సహాయం అందించారు.ఇటీవల నారాయణఖేడ్ పట్టణంలో వాషింగ్ సెంటర్‌లో పనిచేస్తూ ఓ యువకుడు హఠాత్తుగా మృతి చెందగా,ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు కమిటీ ముందుకు వచ్చింది.ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి ఖేడ్ ముస్లిం కమిటీ తరఫున రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు.అలాగే నిరుపేద కుటుంబానికి చెందిన ఓ ఆడపడుచు వివాహానికి రూ.20,000, మరో నిరుపేద కుటుంబానికి చెందిన ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ.5,000 సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణఖేడ్ మాజీ చైర్‌పర్సన్ అనంత్ స్వరూప్ శెట్కార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ,అవసరంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఎల్లప్పుడూ ఖేడ్ ముస్లిం కమిటీ అండగా ఉంటుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖేడ్ ముస్లిం కమిటీ అధ్యక్షులు వసీం కతీబ్, వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఫిరోజ్, అక్బర్ ఖాన్, ముక్రం ఖాన్, జాయింట్ సెక్రటరీ ఇసాక్,ఇమ్రాన్ ఖాధిబ్,ఎండి ఇస్మాయిల్, ఫైయాజ్ హాసమ్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుపేద కుటుంబాలకు అండగా ఖేడ్ ముస్లిం కమిటీ

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ ముస్లిం కమిటీ తరపున నిరుపేద కుటుంబాలకు మానవతా సహాయం అందించారు.ఇటీవల నారాయణఖేడ్ పట్టణంలో వాషింగ్ సెంటర్‌లో పనిచేస్తూ ఓ యువకుడు హఠాత్తుగా మృతి చెందగా,ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు కమిటీ ముందుకు వచ్చింది.ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి ఖేడ్ ముస్లిం కమిటీ తరఫున రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు.అలాగే నిరుపేద కుటుంబానికి చెందిన ఓ ఆడపడుచు వివాహానికి రూ.20,000, మరో నిరుపేద కుటుంబానికి చెందిన ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ.5,000 సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణఖేడ్ మాజీ చైర్‌పర్సన్ అనంత్ స్వరూప్ శెట్కార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ,అవసరంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఎల్లప్పుడూ ఖేడ్ ముస్లిం కమిటీ అండగా ఉంటుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖేడ్ ముస్లిం కమిటీ అధ్యక్షులు వసీం కతీబ్, వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఫిరోజ్, అక్బర్ ఖాన్, ముక్రం ఖాన్, జాయింట్ సెక్రటరీ ఇసాక్,ఇమ్రాన్ ఖాధిబ్,ఎండి ఇస్మాయిల్, ఫైయాజ్ హాసమ్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News