Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తండ్రి ఆశయాలకు నిలువెత్తు నివాళిగా గ్రామంలో సిమెంట్ కుర్చీల ఏర్పాటు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 05:39 PM

నిరుద్యోగులకు ఆశాకిరణంగా కుంభం ఫౌండేషన్ జాబ్ మేళా

నిరుద్యోగులకు ఆశాకిరణంగా కుంభం ఫౌండేషన్ జాబ్ మేళా

నిరుద్యోగులకు ఆశాకిరణంగా కుంభం ఫౌండేషన్ జాబ్ మేళా
May 09, 2026 04:25 AM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారీగా తరలివచ్చిన యువత.. కీర్తిరెడ్డి కృషి అభినందనీయం

భువనగిరి, : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. వన్ మిలియన్ వన్ బిలియన్ సంస్థ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది యువతీ యువకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కుంభం ఫౌండేషన్ చైర్మన్ కుంభం కీర్తిరెడ్డిని పోత్నక్ ప్రమోద్‌కుమార్ ఘనంగా సన్మానించారు. అనంతరం కీర్తిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా, భువనగిరి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఈ జాబ్ మేళా సువర్ణావకాశమని పేర్కొన్నారు.

సుమారు 2 వేల మంది యువతీ యువకులు పాల్గొని తమ విద్యార్హత సర్టిఫికెట్లను ధృవీకరించుకున్నారని తెలిపారు. ఈ నెల 10న నిర్వహించే ఇంటర్వ్యూలలో దాదాపు 20 కంపెనీలు పాల్గొని అభ్యర్థుల కమ్యూనికేషన్ స్కిల్స్, విద్యార్హతల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

న్యూ డైమెన్షన్స్ హైస్కూల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం భోజనాలు, మంచినీటి సదుపాయం తదితర మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ఎండాకాలం తీవ్రత ఉన్నప్పటికీ భారీ సంఖ్యలో యువత హాజరవడం నిరుద్యోగ సమస్య తీవ్రతకు నిదర్శనమన్నారు.

ప్రభుత్వాలు మాత్రమే అన్ని ఉద్యోగాలను కల్పించడం సాధ్యం కాదని, ఇలాంటి సంస్థలు ముందుకు వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కౌన్సిలర్ లయిక్ అహ్మద్, మదర్ పాషా, బబ్లు, పడిగేల ప్రదీప్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మాటూరు బాలేశ్వర్, పిట్టల బాలరాజ్, పుట్ట శివ, సందీప్, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News