Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ పెనుకొండలో బీసీ విద్యార్థులకు వరం.. కొత్తగా 3 హాస్టళ్లు మంజూరు బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 09, 2026 08:06 AM

నిరుద్యోగులకు ఆశాకిరణంగా కుంభం ఫౌండేషన్ జాబ్ మేళా

నిరుద్యోగులకు ఆశాకిరణంగా కుంభం ఫౌండేషన్ జాబ్ మేళా

నిరుద్యోగులకు ఆశాకిరణంగా కుంభం ఫౌండేషన్ జాబ్ మేళా
May 09, 2026 04:25 AM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారీగా తరలివచ్చిన యువత.. కీర్తిరెడ్డి కృషి అభినందనీయం

భువనగిరి, : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. వన్ మిలియన్ వన్ బిలియన్ సంస్థ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది యువతీ యువకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కుంభం ఫౌండేషన్ చైర్మన్ కుంభం కీర్తిరెడ్డిని పోత్నక్ ప్రమోద్‌కుమార్ ఘనంగా సన్మానించారు. అనంతరం కీర్తిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా, భువనగిరి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఈ జాబ్ మేళా సువర్ణావకాశమని పేర్కొన్నారు.

సుమారు 2 వేల మంది యువతీ యువకులు పాల్గొని తమ విద్యార్హత సర్టిఫికెట్లను ధృవీకరించుకున్నారని తెలిపారు. ఈ నెల 10న నిర్వహించే ఇంటర్వ్యూలలో దాదాపు 20 కంపెనీలు పాల్గొని అభ్యర్థుల కమ్యూనికేషన్ స్కిల్స్, విద్యార్హతల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

న్యూ డైమెన్షన్స్ హైస్కూల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం భోజనాలు, మంచినీటి సదుపాయం తదితర మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ఎండాకాలం తీవ్రత ఉన్నప్పటికీ భారీ సంఖ్యలో యువత హాజరవడం నిరుద్యోగ సమస్య తీవ్రతకు నిదర్శనమన్నారు.

ప్రభుత్వాలు మాత్రమే అన్ని ఉద్యోగాలను కల్పించడం సాధ్యం కాదని, ఇలాంటి సంస్థలు ముందుకు వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కౌన్సిలర్ లయిక్ అహ్మద్, మదర్ పాషా, బబ్లు, పడిగేల ప్రదీప్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మాటూరు బాలేశ్వర్, పిట్టల బాలరాజ్, పుట్ట శివ, సందీప్, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News