Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:46 PM

నిర్మల ఆసుపత్రి మార్గంలో నూతన కంటి వైద్య కేంద్రం ప్రారంభం

నిర్మల ఆసుపత్రి మార్గంలో నూతన కంటి వైద్య కేంద్రం ప్రారంభం

నిర్మల ఆసుపత్రి మార్గంలో నూతన కంటి వైద్య కేంద్రం ప్రారంభం
January 21, 2026 11:56 AM 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట పట్టణంలోని నిర్మల ఆసుపత్రి మార్గంలో అలి సాహెబ్ పాషా ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంటి వైద్య కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హాజరయ్యారు. ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో పేద ధనిక భేదం లేకుండా చికిత్స అందిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైద్యులు, పట్టణవాసులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట పట్టణానికి ఈ కంటి వైద్య కేంద్రం ఎంతో ఉపయోగకరంగా మారుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News