Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:58 PM

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన:మహనీయుడు దొడ్డి కొమరయ్య సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన:మహనీయుడు దొడ్డి కొమరయ్య సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన:మహనీయుడు దొడ్డి కొమరయ్య సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్
April 03, 2026 06:53 PM 193 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుడు దిడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య విగ్రహానికి మంత్రి దామోదర రాజనరసింహ, స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రైతుల హక్కుల కోసం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు దిడ్డి కొమరయ్య అని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కొనియాడారు. ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. దొడ్డి కొమరయ్య త్యాగాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. రైతాంగ హక్కుల సాధనలో ఆయన చూపిన ధైర్యసాహసాలు ఎప్పటికీ మరువలేనివని, సమానత్వ సమాజ నిర్మాణానికి ఆయన ఆశయాలు మార్గదర్శకమని అన్నారు. రైతాంగ హక్కుల సాధనలో ఆయన చూపిన ధైర్యసాహసాలు ఎప్పటికీ మరువలేనివని, సమానత్వ సమాజ నిర్మాణానికి ఆయన ఆశయాలు మార్గదర్శకమని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి , డా.శ్రీహరి ,పట్టణ అధ్యక్షుడు ఆర్ వెంకటేశ్వర్లు, లాడే మల్లేశం మాజీ జడ్పీటీసీకొండల్ రెడ్డి ,మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు .

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News