నిదానపల్లిలో ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
నిదానపల్లిలో ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రిజిస్ట్రేషన్ నెంబర్ (8/2021)తో కొనసాగుతున్న ఈ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ సమాజంలో సమానత్వం, న్యాయం స్థాపనకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
అనంతరం రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో రోగులకు అరటి పండ్లు పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, ఉపసర్పంచ్ కొండ అండాలు మల్లయ్య, యూత్ అధ్యక్షుడు రాపోలు సుభాష్, కార్యదర్శి బెల్లం లింగస్వామి, కార్యనిర్వాహక అధ్యక్షుడు సంకు స్వామి, ప్రధాన కార్యదర్శి ఈసం శ్రావణ్, వార్డ్ మెంబర్ ఎకుల మల్లేష్, సంకు లింగయ్య, రాపోలు రమేష్, ఈసం గాలయ్య, భాష మల్ల ప్రభుదాస్, బెల్లం మల్లేష్, భాష మల్ల కృపాకర్, రాపోలు ప్రకాష్, రాపోలు శివాజీ, బెల్లం నాని, రాపోలా ఆకాష్ , వార్డ్ సభ్యులు, మాజీ ఉపసర్పంచ్ నారపాక లక్ష్మణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి