నేటి నుంచి ఉప్పల్ రింగ్రోడ్డు మూసివేత
నేటి నుంచి ఉప్పల్ రింగ్రోడ్డు మూసివేత
Editor Desk
హైదరాబాద్, ప్రతినిధి: ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల నేపథ్యంలో నేటి నుంచి ఉప్పల్ రింగ్రోడ్డు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మూడు నెలల పాటు ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.
రామంతాపూర్, హబ్సిగూడ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక నుంచి బీరప్పగడ్డ మీదుగా వరంగల్ జాతీయ రహదారిని చేరుకోవాల్సి ఉంటుంది.
నాగోల్, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు హయాత్నగర్ మీదుగా పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు లేదా సర్వీస్ రోడ్డుమార్గంగా ఘట్కేసర్ వద్ద జాతీయ రహదారిని చేరుకోవాలని సూచించారు.
పీర్జాదిగూడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఉప్పల్ జంక్షన్కు ముందున్న లక్ష్మారెడ్డి కాలనీ మీదుగా వెళ్లి ఉప్పల్ మెట్రో స్టేషన్ సమీపంలోని మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ వద్ద యూ టర్న్ తీసుకుని ప్రయాణించాల్సి ఉంటుంది.
పీర్జాదిగూడ నుంచి నాగోల్ వెళ్లే వాహనాలు ఉప్పల్ భాగాయత్ లేఔట్ మార్గాన్ని వినియోగించుకోవాలని, నాగోల్ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు కూడా ఇదే మార్గంలో వెళ్లాలని అధికారులు తెలిపారు.
హబ్సిగూడ నుంచి నాగోల్ వైపు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి