నేటి బాలలే రేపటి పౌరులు – నాణ్యమైన విద్యతోనే సమాజ మార్పు :హెడ్మాస్టర్ అక్బర్
నేటి బాలలే రేపటి పౌరులు – నాణ్యమైన విద్యతోనే సమాజ మార్పు :హెడ్మాస్టర్ అక్బర్
Krishna
జ్ఞానం, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసంతో కూడిన విద్యే విద్యార్థుల భవిష్యత్తును బంగారు బాటగా మార్చుతుందని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మైయికోడ్ గ్రామం హెడ్మాస్టర్ అక్బర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలంలోని మైయికోడ్ గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా హెడ్మాస్టర్ అక్బర్ మాట్లాడుతూ…
నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో నిలవాలంటే ఆధునిక సాంకేతికతతో కూడిన నాణ్యమైన విద్య అవసరమని తెలిపారు. విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనతో పాటు సమాజంలో జరుగుతున్న మంచి–చెడులను వివరించి, తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టుకున్న కలల వైపు వారిని నడిపించడమే ఉపాధ్యాయుల ప్రధాన లక్ష్యమన్నారు.విద్యే విద్యార్థుల జీవితాల్లో జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుందని, విద్యతోనే తరగని సంపద లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయులు ఒక శిల్పిలా పనిచేస్తారని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారు సమాజంలో బాధ్యతాయుతంగా ఎలా ఎదగాలో నేర్పడమే ఉపాధ్యాయుల కర్తవ్యమన్నారు.ఉద్యోగాన్ని కేవలం జీతం కోసం కాకుండా విద్యార్థుల జీవితాలను మెరుగుపరచడానికే అంకితంగా భావించి పనిచేస్తామని హెడ్మాస్టర్ అక్బర్ స్పష్టం చేశారు. విద్యార్థులకు ఉత్తమమైన బోధన అందితేనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందన్నారు. నైపుణ్యాలతో పాటు విలువలు, నైతికత, సమాజ పట్ల బాధ్యతను విద్యార్థుల్లో నాటడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమన్నారు.చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో కూడిన విద్య అందిస్తే సమాజంలో గొప్ప మార్పు కనిపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని విద్యార్థుల్లో పెంపొందిస్తామని, పుస్తకాల పాఠాలతో పాటు జీవిత పాఠాలను కూడా బోధిస్తామని తెలిపారు.
విద్యలోనే కాకుండా వ్యక్తిత్వంలోనూ మార్పు తీసుకురావడమే తమ నిజమైన లక్ష్యమని అన్నారు. ప్రతి విద్యార్థిలో జ్ఞానం, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించడమే తమ సంకల్పమని పేర్కొన్నారు. పిల్లల ప్రతిభను గుర్తించి, వారి ఆసక్తులను ప్రోత్సహిస్తూ, జీవితంలో విజయాన్ని సాధించే దిశగా నడిపిస్తామని తెలిపారు.విద్యా వ్యవస్థ ద్వారా లోతైన అభ్యాసం, సృజనాత్మకత, దృఢమైన విలువలను పెంపొందించేలా శిక్షణ అందిస్తామని చెప్పారు. పిల్లలపై నిజమైన శ్రద్ధ చూపించి, వారి వ్యక్తిత్వాన్ని సరైన మార్గంలో తీర్చిదిద్దుతామని అన్నారు. చదువుల్లోనే కాకుండా నైతికతలోనూ విద్యార్థులు ముందుండేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జ్ఞానేశ్వర్, సుప్రియ, ప్రవీణ్ కుమార్ యాదవ్, ప్రశాంతి, సిహెచ్ అంజయ్యతో పాటు విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి