నేత్రపర్వంగా శ్రీ సీతారాముల ఎదుర్కోలు మహోత్సవం
నేత్రపర్వంగా శ్రీ సీతారాముల ఎదుర్కోలు మహోత్సవం
Biksham
అలంకార్ బజార్లో వైభవంగా ప్రారంభమైన వార్షికోత్సవాలు
శ్రీరామనవమి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అలంకార్ బజార్లో శ్రీ సీతారామ వసంత కళ్యాణ మహోత్సవం నలభై తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక గీత మందిరం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకొచ్చి కలశ స్థాపన పూజలు నిర్వహించారు. అనంతరం పసుపు దంచి వేడుకలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం నిర్వహించిన శ్రీ సీతారాముల ఎదుర్కోలు మహోత్సవం భక్తులను ఆకట్టుకుని నేత్రపర్వంగా నిలిచింది. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మీలా మహదేవ్ మాట్లాడుతూ అలంకార్ బజార్లో అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తోట శ్యాంప్రసాద్, కోశాధికారి మురారిశెట్టి శ్రీదర్, ఉపాధ్యక్షులు కాసం జగన్, గుడిపాటి సురేష్, గోదల మల్లారెడ్డి, వీర్లపాటి రమేష్, తోట రాజగోపాల్, వీర్లపాటి విజయ్, సంయుక్త కార్యదర్శులు పోతుగంటి మనోహర్, బూర్ల మధు, రజనీకాంత్, ఏకాంబరం, జూలకంటి ఉదయ్ తదితరులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి