చిట్యాల స్థానికం ప్రతినిది కొమిడాల మహేందర్ రెడ్డి
నేతాజీ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు గుండెబోయిన సైదులు ఆధ్వర్యంలో మహానేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన అజేయ స్ఫూర్తిని స్మరించుకున్నారు.
కార్యక్రమంలో గుండెబోయిన సైదులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సమరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన చూపిన ధైర్యం, దేశభక్తి, త్యాగస్ఫూర్తి యువతకు మార్గదర్శకమని అన్నారు. నేతాజీ ఆశయాలను ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నేతాజీకి ఘన నివాళులర్పించారు. కార్యక్రమం దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా కొనసాగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి