నీట్ పేపర్ లీక్పై యువజన కాంగ్రెస్ నిరసన
నీట్ పేపర్ లీక్పై యువజన కాంగ్రెస్ నిరసన
K.RAVI
మోదీ ఫ్లెక్సీ దహనం.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్
చౌటుప్పల్ మండల కేంద్రంలో నీట్–2026 పరీక్ష పేపర్ లీక్ జరిగినట్లు నిర్ధారణ కావడంతో పరీక్ష రద్దు చేసిన నేపథ్యంలో బుధవారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ భార్గవ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సంఘీభావంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్లెక్సీ ఫోటోను దహనం చేసి ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోషిక వినయ్, నియోజకవర్గ అధ్యక్షుడు అబ్బనబోయిన రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో 89 పరీక్షల పేపర్లు లీక్ కావడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. పరీక్షలను సక్రమంగా నిర్వహించలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లీకేజీ వెనుక ఎంత పెద్ద నాయకుల హస్తం ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జాల మణికంఠ యాదవ్, నారాయణపురం మండల అధ్యక్షుడు రెడ్యానాయక్, మండల కమిటీ కార్యదర్శులు పబ్బతి వెంకటేష్, ఆవుల రాజు, చింతల శివ, సీనియర్ నాయకులు పెద్దగోని రమేష్ గౌడ్, మాజీ టౌన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చెరుకు లింగస్వామి, యువజన కాంగ్రెస్ నాయకులు తొర్పునూరి రవి గౌడ్, తీగుల్ల రాఘవేంద్ర, చింతకింది గణేష్, యాట సంతోష్, ముజాయిద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి