Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సతీష్‌నగర్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు..భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నదానం సీఎం, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో సభా వేదిక, భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 12, 2026 10:12 PM

నీట్‌ అవ్యవస్థలతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం ఎన్‌టీఏను రద్దు చేయాలి: డీవైఎఫ్‌ఐ

నీట్‌ అవ్యవస్థలతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం ఎన్‌టీఏను రద్దు చేయాలి: డీవైఎఫ్‌ఐ

నీట్‌ అవ్యవస్థలతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం  ఎన్‌టీఏను రద్దు చేయాలి: డీవైఎఫ్‌ఐ
May 12, 2026 08:27 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ

నీట్‌ పరీక్షల్లో వరుసగా జరుగుతున్న అవ్యవస్థలు, పేపర్‌ లీక్‌లతో దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్‌ అన్నారు. ఎన్‌టీఏను వెంటనే రద్దు చేసి పారదర్శకమైన కొత్త పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

మంగళవారం నల్గొండలో నిర్వహించిన డీవైఎఫ్‌ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సంవత్సరాల పాటు కష్టపడి చదివిన విద్యార్థుల కలలు పేపర్‌ లీక్‌ల కారణంగా ఛిన్నాభిన్నం అవుతున్నాయన్నారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లలను చదివిస్తుంటే పరీక్షల నిర్వహణలో అవినీతి, భద్రతా లోపాలు వారి ఆశలను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఎన్‌టీఏ నిర్వహించిన పలు పరీక్షలు లీకేజీకి గురయ్యాయని, అయినా కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదన్నారు.

నీట్‌ పేపర్‌ లీక్‌లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు.

సమావేశంలో డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లెంల శ్రీకర్‌, పతాని శ్రీను, గుండాల నరేష్‌, కట్ట లింగస్వామి, పోకల శశిధర్‌, పాలది కార్తీక్‌, కండె యాదగిరి, తరి రామకృష్ణ, ఏడుకొండలు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News