నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు ఘనంగా
నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు ఘనంగా
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ భవన్లో శనివారం రమాబాయి అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంతో ఆత్మీయంగా, ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మాట్లాడుతూ రమాబాయి అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు,మహిళా సాధికారత కోసం ఆమె చేసిన పోరాటం అనితర సాధ్యమని కొనియాడారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో రమాబాయి అంబేద్కర్ పాత్ర మరువలేనిదని ఆయన పేర్కొన్నారు.సామాజిక సమానత్వం,న్యాయం కోసం ప్రతి ఒక్కరూ ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, న్యాల్కల్ మండల అధ్యక్షులు నవీన్ కుమార్, కమిటీ సభ్యులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. కార్యక్రమం చివర్లో రమాబాయి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలనే సంకల్పాన్ని పాల్గొన్నవారు వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి