నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్గా కొనతం చిన వెంకటరెడ్డి
నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్గా కొనతం చిన వెంకటరెడ్డి
Biksham
వైస్ చైర్మన్గా నూకల సందీప్ రెడ్డి ప్రకటన
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి
నేరేడుచర్ల పురపాలక సంఘ చైర్మన్గా కొనతం చిన వెంకటరెడ్డి, వైస్ చైర్మన్గా నూకల సందీప్ రెడ్డిని నియమిస్తున్నట్లు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో జరిగిన సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, పారదర్శక పరిపాలన లక్ష్యంగా కొత్త బాధ్యతలు అప్పగించామని మంత్రి వివరించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పురపాలక సంఘం పనిచేయాలని, పట్టణంలో మిగిలిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కొనతం చిన వెంకటరెడ్డి, నూకల సందీప్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు ఈ నియామకాలను స్వాగతిస్తూ అభినందనలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి నూతన దిశగా ముందుకు సాగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి