నేలపట్లలో సీసీ కెమెరాల ప్రారంభం గ్రామ భద్రతకు బలోపేతం
నేలపట్లలో సీసీ కెమెరాల ప్రారంభం గ్రామ భద్రతకు బలోపేతం
K.RAVI
గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నాగేష్ గౌడ్
మెరుగు శీనుకు ఘన సన్మానం
నేలపట్ల గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత లక్ష్యంగా నేలపట్ల గ్రామపంచాయతీలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నాగేష్ గౌడ్ సీసీ కెమెరాలను ప్రారంభించి గ్రామాభివృద్ధిలో ఇది ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ఆర్థిక సహకారం అందించిన మెరుగు శీనును సర్పంచ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. గ్రామాభివృద్ధికి ముందుండి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ బ్రాహ్మణి, 5వ వార్డు మెంబెర్ పాలమాకుల కవిత నర్సింగ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, 6వ వార్డు మెంబెర్ పాలమాకుల నవ్య నరసింహ, (ఏఎంసీ డైరెక్టర్), 9వ వార్డు మెంబర్ చప్పిడి సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ గుండుమల్లయ్య గౌడ్, తడక ఆంజనేయులు, మాజీ వార్డు మెంబర్ కోరగోని నరసింహ, పబ్బు మహేష్, గంజి సురేష్, భావండ్లపల్లి రాజు, యూత్ కాంగ్రెస్ చౌటుప్పల్ మండల ఉపాధ్యక్షుడు చౌట లింగస్వామి, కార్యదర్శి పబ్బతి వెంకటేశం, గుండు రాజు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో భద్రత మరింత మెరుగుపడుతుందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని సర్పంచ్ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి